
- వారి చొరవతోనే రైల్వే ఫ్లైఓవర్నిర్మాణం పూర్తి
- కాంగ్రెస్ నేతల సంబురాలు
కోల్ బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్నిర్మాణానికి కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోలకు కాంగ్రెస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీగా వివేక్ వెంకటస్వామి కొనసాగిన కాలంలో ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని సాంక్షన్ చేయించారన్నారు. కానీ పదేండ్లు కాలంలో బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేయించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. గేటు వద్ద ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయారన్నారు.
ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, ఎంపీగా వంశీకృష్ణ గెలిచిన వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయించి ప్రజల కష్టాలను దూరం చేశారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ లీడర్లు తామే బ్రిడ్జిని పూర్తి చేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, లీడర్లు అబ్దుల్అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ జడ్పీటీసీ యాకుబ్ అలీ, మెట్ట సుధాకర, గోపతి బానేశ్, కల్యాణ్, రాజం తదితరులు పాల్గొన్నారు.