
- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రమిస్తే తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందనుకున్నామని, కానీ ప్రజలు పదేండ్లుగా అడుగడుగునా దగా పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. తెలంగాణ కోసం 1,200 మంది యువత తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. సోమవారం ఆయన పలువురు ఉద్యమ నాయకులతో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
ALSO READ : పీఎఫ్ వడ్డీ త్వరలోనే వేస్తం
తెలంగాణ నిర్మాణం కోసం సోనియా గాంధీ మాటిచ్చారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం కేసీఆర్ కుటుంబం జేబుల్లోనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లనో రాలేదని తెలంగాణ విఠల్ అన్నారు. త్యాగాలేమో ప్రజలవని, భోగాలు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్నదని మండిపడ్డారు. దంచుడే దించుడే నినాదంతో పౌర సమాజంతో కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు.