
చేర్యాల, వెలుగు: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ నిధులు వరం లాంటివని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం దూల్మిట్ట మండల కేంద్ర నిరుపేద విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చెన్నోజు మమత కు రూ. లక్షా 75వేల ఎల్ఓసీని ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, రామచంద్రం, గొల్లపల్లి రమేశ్, సుందరగిరి భాస్కర్, గంగాధర్, నరసింహులు, కోల సత్తయ్య ,కృష్ణమూర్తి, రమేష్, పులి కనకయ్య, మల్లయ్య ,కొంక బాలరాజు, ఐలయ్య పాల్గొన్నారు.