దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగింది : సీఎం రేవంత్ రెడ్డి

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగింది : సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్ధమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పారు రేవంత్. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ సోనియాతో పాటు ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు సోనియా గాంధీతో కేబినెట్ విస్తరణతో చర్చించినట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీ ఎన్నికల ఫలితాల గురించి వివరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే  CWC సమావేశానికి హాజరుకానున్నారు.