
- మంత్రి పొన్నంకు క్షమాపణ చెప్పకపోతే అడ్డుకుంటాం
- గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన
హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల పనులను కాంగ్రెస్ఐదేండ్లళ్లలో ముప్పావుమందంజేస్తే పదేండ్ల బీఆర్ఎస్ పావలావంతు కూడా పూర్తి చేయలేదని కాంగ్రెస్, జేఏసీ నాయకులు విమర్శించారు. ఇందుకు ఆధారాలు ఉన్నా మాజీ మంత్రి కేటీఆర్ ప్రాజెక్టును తామే పూర్తిచేశామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమీషన్లు దొబ్బుకునేందుకు ట్రయల్రన్ చేశారన్నారు. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్పై అహంకారపూరితంగా కేటీఆర్మాట్లాడుతూ, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై అబద్ధాలు చెప్పినందుకు నిరసనగా శనివారం కాంగ్రెస్ కార్యకర్తలు
ప్రజాసంఘాల నాయకులు ప్రాజెక్టు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ మేకల వీరన్న, టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందు, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు కేటీఆర్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్టును కంప్లీట్ చేశామన్న కేటీఆర్ మాటల్లో నిజమెంత ఉందో చూపించారు. కాంగ్రెస్ హయాంలో తవ్విన కాల్వలే తప్ప, బీఆర్ఎస్చేసిన పనులు లేవన్నారు
అధికారం పోయిందనే కేటీఆర్, హరీశ్రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తానన్న అప్పటి సీఎం కేసీఆర్ పదేండ్లైనా ప్రాజెక్టును పూర్తిచేయకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నిస్తే, కేటీఆర్ అహంకారంతో దబాయిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు కేటీఆర్క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను అడ్డుకొని నిలదీస్తామని హెచ్చరించారు.