
పిట్లం, వెలుగు: యాక్సిడెంట్ లో కానిస్టేబుల్ చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ రాజు తెలిపిన ప్రకారం.. పిట్లం పీఎస్ కానిస్టేబుల్బుచ్చయ్యచారి(35) గురువారం రాత్రి డ్యూటీ ముగించుకుని బైక్ పై బాన్సువాడకు వెళ్తున్నాడు.
రాత్రి11 గంటల సమయంలో సిద్దాపూర్చెరువు కట్ట వద్ద ఈత చెట్టుకు ఢీకొట్టాడు. దీంతో అతని ఛాతికి, తలకు తీవ్రగాయాలపై స్పాట్ లో చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.