
- గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు
- కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్
- త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేనున్న అధికారులు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు గుండెపోటుకు గురైనప్పుడు గోల్డెన్అవర్లో ప్రాణాలను కాపాడేందుకు గోదావరిఖనిలో రూ.13 కోట్లతో కార్డియాక్ క్యాథ్ల్యాబ్నిర్మాణాన్ని చేపట్టింది. కార్మికులు గనుల్లో, ఓపెన్ కాస్ట్ప్రాజెక్ట్ల్లోని పని పరిస్థితుల కారణంగా ఒత్తిడికి గురై గుండెపోటు బారిన పడుతుంటారు. దీంతో మరణాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. ఎవరైనా కార్మికుడికి హార్ట్ స్ట్రోక్ వస్తే సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్యసేవలు అందించి హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, వరంగల్వంటి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు రెఫరల్ చేస్తుంటారు. ఇందుకు గోదావరిఖని నుంచి నాలుగు గంటలు, కరీంనగర్కు గంటన్నర సమయం పట్టేది. ఇలా గంటల సమయం తీసుకోవడంతో పేషెంట్ల ప్రాణాలకు ముప్పుగా మారేది.
సకాలంలో చికిత్స అందక చనిపోతున్న ఘటనలు ఉంటున్నాయి. దీంతో సింగరేణిలోనే తొలిసారిగా గోదావరిఖనిలోని కంపెనీ ఏరియా ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ను నిర్మిస్తున్నారు. ఇందులో అవసరమైన గదులు నిర్మించగా ఫినిషింగ్ వర్క్స్ నడుస్తోంది. ఇక్కడ నిర్మించే క్యాథ్ల్యాబ్పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని సుమారు 65 శాతం కార్మికులు, కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగంగా మారనుంది. ల్యాబ్ లో ఇద్దరు కార్డియాలజిస్ట్లు, టెక్నీషియన్లు, విలువైన మెషీన్లను త్వరలోనే అందుబాటులో తెచ్చి ప్రారంభిస్తారు.
పీపీపీ పద్ధతిలో వైద్య సేవలు అందించేలా..
క్యాథ్ల్యాబ్లో సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. మరోవైపు ప్రైవేటు వ్యక్తులకు కూడా వైద్యాన్ని పబ్లిక్ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో అందించేందుకు సింగరేణి ఆలోచన చేస్తోంది. గుండెపోటుకు గురైన, లక్షణాలు కలిగిన పేషెంట్ల వద్ద కొంత డబ్బు తీసుకుని సేవలు అందించేందుకు వీలుగా మేనేజ్మెంట్విధివిధానాలు ఖరారు చేసే చాన్స్ ఉంది.
నాలుగు జిల్లాల కార్మికులకు అందుబాటులోకి..
గోదావరిఖనిలో నిర్మించే కార్డియాక్ క్యాథ్ల్యాబ్తో సింగరేణి విస్తరించిన పెద్దపల్లి జిల్లా పరిధి గోదావరిఖని (ఆర్జీ –1 ఏరియా), యైటింక్లయిన్కాలనీ (ఆర్జీ –2 ఏరియా), సెంటినరీ కాలనీ (ఆర్జీ –3 ఏరియా), అడ్రియాల ప్రాజెక్ట్ఏరియా (ఏపీఏ), మంచిర్యాల జిల్లా పరిధి శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్జిల్లా పరిధి గోలేటి, భూపాలపల్లి జిల్లా పరిధి భూపాలపల్లి ప్రాంతాల సంస్థ కార్మికులు, కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రానుంది. బొగ్గు గనుల ప్రాంతాల నుంచి గంట వ్యవధిలోనే గోదావరిఖని ఆస్పత్రికి చేరుకోవచ్చు. గోల్డెన్అవర్ లోనే పేషెంట్ల ప్రాణాలను కాపాడే వీలుంటుంది.
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలు
కార్పొరేట్ఆస్పత్రులకు దీటుగా సేవలు అందించేలా సింగరేణిలో తొలిసారిగా గోదావరిఖనిలోని ఆస్పత్రిలో కార్డియాక్క్యాథ్ల్యాబ్ను నిర్మించాం. ల్యాబ్లో అవసరమైన మెషీన్ల అమర్చే పని నడుస్తోంది. త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. సింగరేణి కార్మికులతో పాటు ప్రైవేటు వ్యక్తులకు కూడా క్యాథ్ల్యాబ్లో సేవలు అందించేలా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం.
డాక్టర్ కిరణ్రాజ్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సింగరేణి