- గత ప్రభుత్వ టైంలో పనులు చేసినా ఇప్పటికీ బిల్లులివ్వలేదని నిరసన
- రూ.50లక్షలు పెట్టి అప్పులపాలయ్యానని ఆవేదన
ఇబ్రహీంపట్నం, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు నేటికీ బిల్లులు చెల్లించలేదంటూ ఓ కాంట్రాక్టర్ తహసీల్దార్ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపాడు. తనకు రావాల్సిన బిల్లులు చెల్లించే వరకు తీయబోనని తేల్చి చెప్పాడు. బీఆర్ఎస్హయాంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ఆఫీస్శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ పక్కనే పాక్షికంగా నిర్మించి వదిలేసిన జడ్పీ అతిథి గృహంలోకి షిఫ్ట్చేయాలని అధికారులు నిర్ణయించారు. పనులను పోల్కంపల్లి గ్రామానికి చెందిన గండికోట దానయ్య అనే సివిల్కాంట్రాక్టర్కు అప్పగించారు.
ఒప్పందం ప్రకారం రూ.50 లక్షల ఖర్చుతో దానయ్య పనులు పూర్తి చేశాడు. తర్వాత తహసీల్దార్ఆఫీస్జడ్పీ అతిథి గృహంలోకి షిఫ్ట్చేశారు. ప్రస్తుతం అందులోనే కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో సోమవారం తహసీల్దార్ఆఫీస్గేటుకు తాళం వేసి కాంట్రాక్టర్దానయ్య నిరసన తెలిపాడు. బిల్లుల కోసం ఏండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నానని వాపోయాడు. బిల్డింగ్పనులు పూర్తిచేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సముదాయించడంతో నిరసనను విరమించాడు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు.