రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లుల్లేవ్..నేషనల్​ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆరోపణ

రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లుల్లేవ్..నేషనల్​ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆరోపణ

పంజాగుట్ట, వెలుగు: కాంట్రాక్టర్లు చేసిన పనులకు రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదని నేషనల్​ కాంట్రాక్టర్స్​ అసోసియేషన్​ ఆరోపించింది. ఇప్పటివరకు అన్ని విభాగాల కాంట్రాక్టు పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.14 వేల కోట్లు బకాయి ఉందన్నారు.  హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సోమవారం నిర్వహించిన సమావేశంలో నేషనల్​ కాంట్రాక్టర్స్​ అసోసియేషన్​ ఏర్పాటు చేస్తున్నట్టు అధ్యక్షుడు వి.శ్రీనివాస గౌడ్​, కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు ప్రకటించారు.