
న్యూఢిల్లీ: కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ భోపాల్లో ఒక గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ కోసం రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఫెసిలిటీ శంకుస్థాపన తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్నారు. “బద్వాయ్ ఐటీ పార్క్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమిపై తాజా ఫెసిలిటీని నిర్మిస్తాం. ఇందుకోసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాం. సుమారు 200 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది’’ అని కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డేటా ప్రాసెసింగ్ అప్లికేషన్లకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలోని డిజిటల్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేస్తామని తెలిపింది.