పోలీస్​ సిబ్బంది బదిలీలపై వివాదం!

పోలీస్​ సిబ్బంది బదిలీలపై వివాదం!
  • ఈ నెల 7న సీపీ అంబర్​కిశోర్​ఝా ట్రాన్స్​ఫర్ఆ
  • యన రిలీవ్​అయిన 9వ తేదీన 40 మంది బదిలీ

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ఇటీవల జరిగిన పోలీస్​సిబ్బంది బదిలీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. కమిషనరేట్ లోని వివిధ స్టేషన్లలో పని చేస్తున్న 33 మంది పీసీలు, ముగ్గురు హెడ్​కానిస్టేబుళ్లు, నలుగురు ఏఎస్సైలు మొత్తంగా 40 మంది రెండు విడతల్లో ఒకేరోజు బదిలీ కాగా, ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండానే బదిలీలు చేశారంటూ ట్రాన్స్​ఫర్స్​కోసం ఎదురుచూస్తున్న కొందరు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ నెల 7న సీపీ అంబర్​కిశోర్​ఝాను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన 9వ తేదీన వరంగల్ నుంచి రిలీవ్​అయ్యారు. ఆయన రిలీవ్​అయిన 9వ తేదీన ఈ 40 మంది సిబ్బందిని బదిలీ చేసినట్టు ట్రాన్స్​ఫర్స్​ఆర్డర్స్​ కాపీలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత బదిలీ అయిన సిబ్బంది ఆయా స్టేషన్ల నుంచి రిలీవ్​అయినట్లు తెలిసింది. 

కాగా, ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్​కాపీలు సోషల్​మీడియాకెక్కగా, బదిలీల వ్యవహారంపై పోలీస్​వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదిలాఉంటే ట్రాన్స్​ఫర్​ అయిన 40 మందిలో ఐదుగురు మినహా మిగతా వాళ్లంతా సెంట్రల్​ జోన్​పరిధిలో పోస్టింగ్​దక్కించుకోవడం గమనార్హం. దీంతో ట్రాన్స్​ఫర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీస్​ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై వరంగల్ సీపీగా ఇటీవల ఛార్జ్​తీసుకున్న సన్​ ప్రీత్​ సింగ్ ను వివరణ కోరగా, ఈ విషయం ఇంతవరకూ తన దృష్టికి రాలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.