ఇంటింటి నుంచి పిడికెడు బియ్యం సేకరించి .. అనాథలకు అందజేసిన కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు

ఇంటింటి నుంచి పిడికెడు బియ్యం సేకరించి .. అనాథలకు అందజేసిన కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు
  • రెండున్నర క్వింటాళ్లు అనాథలకు అందజేత

కోడేరు,వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో అనాథ ఆశ్రమంలో  ఉన్న  పిల్లలకు , తాతలకు, అవ్వలకు తమ వంతు సహాయం చేయాలని సోమవారం పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామ చందు కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం కలిసి  ప్రతీ ఇంటి నుంచి  పిడికెడు బియ్యం సేకరించారు. 

ఇలా  సేకరించిన  రెండున్నర క్వింటాళ్ల  బియ్యాన్ని  అనాథాశ్రమంలో అందించారు. ఈ కార్యక్రమంలో  కరస్పాంట్ కే.సరోజినీ దేవి,   ఉపాధ్యాయులు గణపతి, హుస్సేన్, నరసింహ, సమీరా, రాణి, అనిత, మేరీ పాల్గొన్నారు.