స్టార్టప్​ : ఇక్కడ తక్కువ ఖర్చుతోనే పెట్రోల్​ బండిని ఈవీగా..!

స్టార్టప్​ : ఇక్కడ తక్కువ ఖర్చుతోనే పెట్రోల్​ బండిని ఈవీగా..!

బండి బయటికి తీస్తే.. ఓ వైపు పెట్రోల్​ ఖర్చు, మరోవైపు పొల్యూషన్ ​. పెట్రోల్​తో నడిచే బైక్​లు అటు జేబుకు, ఇటు ఆరోగ్యానికి చిల్లు పెడుతున్నాయి. అమ్మేసి ఎలక్ట్రిక్​ వెహికల్స్​ కొందామంటే సగం ధర  కూడా పలకదు. అలాంటప్పుడుఏం చేయాలి? అంటే పాత పెట్రోల్​ బండినే ఈవీగా మార్చుకోవాలి అంటోంది శివశంకరి. అలా మార్చేందుకే ఆమెఏఆర్​4 టెక్​ పేరుతో ఒక స్టార్టప్ పెట్టింది.ఇక్కడ తక్కువ ఖర్చుతోనే పెట్రోల్​ బండ్లనుఎలక్ట్రిక్​ వెహికల్స్​గా మార్చేస్తున్నారు.

గ డిచిన కొన్నేండ్లలో ఈవీ ఇండస్ట్రీ చాలా డెవలప్​ అయ్యింది. కానీ.. కంపెనీలన్నీ కొత్త వెహికల్స్​ తయారుచేయడంపైనే దృష్టి పెట్టాయి.  శివశంకరి మాత్రం పాత పెట్రోల్​ వెహికల్స్​ని ఈవీలుగా మార్చాలి అనుకుంది. అనుకున్నట్టుగానే రూ. 39,900కే పెట్రోల్ బైక్​లను రెట్రోఫిటింగ్ సొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎలక్ట్రిక్ వెహికల్స్​గా మారుస్తోంది. దీనిద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే ఆమె లక్ష్యం.  

కష్టాల ప్రయాణం

శివశంకరి కాంచీపురానికి దగ్గర్లోని తక్కోలం అనే మారుమూల గ్రామంలో పుట్టింది. ఆ ఊళ్లో చదువుకోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవు. వాళ్ల నాన్న మాత్రం ఎలాగైనా తన కూతుళ్లను బాగా చదివించాలి అనుకున్నాడు. శివశంకరితోపాటు తన అక్కను గ్రాడ్యుయేషన్​ చేయించాడు.

వాళ్ల ఫ్యామిలీలో వీళ్లే మొదటి మహిళా గ్రాడ్యుయేట్లు. శివశంకరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటెక్​ చేసి, లెక్చరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జీవితాన్ని మొదలుపెట్టింది. తర్వాత ఎంట్రపెన్యూర్​గా మారి పట్టు చీరలు అమ్మడం, హెర్బల్​ హెయిర్​ ట్రీట్​మెంట్​ బిజినెస్​ లాంటివి చేసింది. కానీ.. అంతలోనే కరోనా రావడంతో తన వెంచర్లకు ఫుల్​స్టాప్​ పడింది. 

మళ్లీ ఉద్యోగం.. 

బిజినెస్​లు మూసేసిన తర్వాత కరోనా టైంలోనేకోయంబత్తూరుకు వెళ్లింది. అక్కడ ఎలక్ట్రిక్ టూవీలర్స్​ కోసం మోటార్లు తయారుచేసే ఈఎంఎఫ్​ ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆపరేషన్స్ మేనేజర్​గా చేరింది. కంపెనీలో మంచి టీమ్​ని రెడీ చేసి బిజినెస్​ పెరిగేలా చేసింది. తాను లెక్చరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన అనుభవం వల్ల స్టూడెంట్స్​కెపాసిటీని ఈజీగా గుర్తించగలుగుతుంది. అందుకే మంచి టీమ్​ని బిల్డ్​ చేయగలిగింది.

కానీ.. కొన్నాళ్లకు ఆ కంపెనీ శ్రీరామ్ పిస్టన్స్ అండ్​ రింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీలో విలీనం అయ్యింది. తర్వాత కూడా కొంతకాలం అక్కడే పనిచేసింది. ఆ తర్వాత సొంతంగా ఏఆర్​4 టెక్​ పేరుతో కొత్త వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఈఎంఎఫ్​లో కలిసి పనిచేసిన మహేష్ పాండే కూడా ఆమెకు తోడయ్యాడు. కంపెనీకి కావాల్సిన పెట్టుబడిని మెంటార్​, ప్రొఫెసర్​ సీసీ హాంగ్​ అందించాడు. ఈఎంఎఫ్​లో ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్ల కోసం మోటార్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన టీమ్​కి శివశంకరి హెడ్​గా పనిచేసింది. ఆ ఎక్స్​పీరియెన్స్​ ఆమె కంపెనీ పెట్టినప్పుడు బాగా పనికొచ్చింది. 

ఈవీలుగా.. 

ప్రధానంగా మామూలు టూవీలర్​(ఇంటర్నల్​ కంబాషన్ ఇంజిన్) వెహికల్స్​ని రూ. 39,900 ఖర్చుతో రెండు గంటల్లోనే ఈవీలుగా మార్చడమే ఏఆర్​4 కంపెనీ ప్రత్యేకత. అందుకే కంపెనీకి ఆపేరు పెట్టారు. ఏఆర్​4లో ఏ అంటే ఆటోమోటివ్, నాలుగు ఆర్​లు.. రిపేర్, రిఫర్బిష్, రీపర్పస్, రీసైకిల్ అనే పదాలను సూచిస్తాయి.

ముఖ్యంగా హోండా యాక్టివా, టీవీఎస్​ జెస్ట్ లాంటి ఫేమస్​ టూవీలర్​ మోడల్స్​ని మార్చేందుకు అప్రూవల్స్ రావడంతో వాళ్లు తయారుచేసే కిట్​కి డిమాండ్​ బాగా పెరిగింది. ‘నో–వెల్డ్, నో–గ్రైండ్, నో–కట్, నో–డ్రిల్ విధానంలో ఇంజిన్​ని తీసేసి, సింపుల్​గా ప్లగ్-అండ్-ప్లే పద్ధతిలో బ్యాటరీ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బిగిస్తారు.  

కొత్తగా మార్కెటింగ్​

ఏఆర్​4 టెక్​ కంపెనీ ఎక్కువగా టైర్ 3, 4 సిటీల్లోనే మార్కెటింగ్​ చేస్తోంది. ఒక మార్కెటింగ్​ టీం వారానికోసారి పొల్లాచ్చి, కరూర్, తిరుప్పూర్ లాంటి చుట్టుపక్కల పట్టణాలకు వెళ్తుంది. స్థానిక సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్స్​ దగ్గర, స్కూల్స్​, కాలేజీలు, ప్రజలు ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో వాళ్ల రెట్రో ఫిటింగ్​ ఈవీల గురించి వివరిస్తారు. నేరుగా కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటారు. 

సవాళ్లు

శివశంకరికి కంపెనీ పెట్టగానే సక్సెస్​ రాలేదు. స్టార్టప్​ పెట్టాలని నిర్ణయించు కున్నప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఇలాంటి కంపెనీలు పెట్టాలంటే ఏఆర్​ఏఐ(ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), రాష్ట్ర రవాణా సంస్థ నుంచి పర్మిషన్లు తీసుకోవాలి. కానీ.. అది అంత ఈజీ కాదు. అందుకోసం శివశంకరి చాలా కష్టపడింది. ఆ తర్వాత రెట్రో ఫిటింగ్ కోసం టీమ్​ని నిర్మించడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఈ రంగంపై అవగాహన ఉన్నవాళ్లు చాలా తక్కువ. వాళ్లను వెతికి పట్టుకోవడం పెద్ద టాస్క్​. అందుకే కొంతమంది లోకల్​వాళ్లను రిక్రూట్ చేసుకుని వాళ్లకే ట్రైనింగ్​ ఇప్పించింది. పైగా కంపెనీలో 25 శాతం మంది ఉద్యోగులు మహిళలే. ‘‘ప్రారంభంలో బైక్​ పార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడదీయడం కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఈజీగా విడదీస్తున్నా.”అని ఏఆర్​4 టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ​ టెక్నీషియన్​గా పనిచేస్తున్న తంగామణి చెస్తోంది. 

ట్రైనింగ్​ ప్రోగ్రామ్స్​

స్టార్టప్ ద్వారా​ ట్రైనింగ్​ ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టారు. ఆటోమోటివ్ స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్, వరల్డ్ స్కిల్ కౌన్సిల్ ధృవీకరించిన మూడు నెలల డిప్లొమా కోర్సులు అంది స్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి స్కిల్స్​ నేర్పించారు. వీటన్నింటి వల్ల కంపెనీ చాలా స్పీడ్​గా డెవలప్​ అవుతోంది.

గత సంవత్సరం కంపెనీకి రూ. 1.67 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం రూ. 4 కోట్లకు వరకు వస్తుందని అంచనాలు ఉన్నాయి. ‘‘భవిష్యత్తులో  ట్రాక్టర్లను కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్​గా మార్చేందుకు ప్లాన్​ చేస్తున్నాం. ఆ తర్వాత బస్సులు, ట్రక్కులకు కూడా విస్తరిస్తాం” అంటోంది శివశంకరి.  

సొంతంగా మోటార్లు..

పెట్రోల్​ వెహికల్స్​ని ఈవీలుగా మార్చే క్రమంలో అవసరమయ్యే పరికరాల కోసం ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడకుండా సొంతంగానే తయారుచేసుకుంటున్నారు. వాళ్లు డిజైన్​ చేసుకున్న మోటార్లనే వాడుతున్నారు. సోడియం–అయాన్ బ్యాటరీ ప్యాక్​ల తయారీకోసం ప్లాంట్ ఏర్పాటుచేసుకున్నారు. అది తమిళనాడులోనే మొదటి ప్లాంట్​.

ప్రస్తుతం కంపెనీ రెట్రోఫిట్టింగ్​ చేసిన వెహికల్స్​ ఒక్క చార్జ్​తో  50  కిలోమీటర్లు వెళ్తాయి. 40 కి.మీ/గం స్పీడ్​తో ప్రయాణించగలవు. మోటారు, బ్యాటరీపై మూడు సంవత్సరాలు, కంట్రోలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 800కు పైగా పెట్రోల్​ బైక్​లను ఈవీలుగా మార్చారు. బైక్​లే కాదు.. పాత టాటా దోస్త్ ట్రక్​లను కూడా ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా మార్చారు.