ఆయిల్ ట్యాంకర్ బోల్తా..నూనె కోసం ఎగబడ్డ జనం 

ఆయిల్ ట్యాంకర్ బోల్తా..నూనె కోసం ఎగబడ్డ జనం 

దమ్మపేట, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం పొదలమ్మ ఆలయం వద్ద శుక్రవారం వంట నూనె ట్యాంకర్ బోల్తా పడడంతో జనం బకెట్లు, బిందెలతో నూనె కోసం ఎగబడ్డారు. అశ్వారావుపేట వైపు నుంచి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న ఆయిల్​ట్యాంకర్​ మొద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి  నూనె లీక్​అవుతుండడంతో గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు తీసుకొని ట్యాంకర్‌‌ వద్దకు పరుగులు తీశారు.

వీలైనంత వరకు వాటిల్లో నింపుకోవడానికి ఎగబడడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపట్లోనే ట్యాంకర్​ మొత్తం ఖాళీ చేశారు. ఈ సందర్భంగా రోడ్డుకు రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అందరినీ పంపించేశారు. కాకినాడ నుంచి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకెళ్తుండగా డ్రైవర్‌‌ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.