
కుంటాల, వెలుగు : కుంటాల మండల కేంద్రంలో హనుమాన్ దీక్షాదారులకు ఆదివారం కూలర్లను అందజేశారు. గ్రామానికి చెందిన నంద గిరి అన్వేశ్ జూనియర్ అసిస్టెంట్ ఆదివారం హనుమాన్ ఆలయ సన్నిధానంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి, రూ.పది వేలు విలువ చేసే రెండు కూలర్లను అందజేశారు.
ఈ సందర్భంగా అన్వేశ్ను స్వాములు సన్మానించారు.