సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ పై మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కొరియాగ్రఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారంతో పాటు తనను శారీరకంగా.. మానసికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది.
తనకు వచ్చే అవకాశాలను అడ్డుకుంటున్నారని సదరు మహిళ ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 376 అత్యాచార కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును ఆ స్టేషనుకు బదిలీ చేశారు.