ఏపీలో మ‌రో 31 క‌రోనా కేసులు.. సీఎం ఇంటి స‌మీపంలో మ‌హిళ మృతి

ఏపీలో మ‌రో 31 క‌రోనా కేసులు.. సీఎం ఇంటి స‌మీపంలో మ‌హిళ మృతి

ఏపీలో కొత్త‌గా మ‌రో 31 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 603కు చేరిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అందులో ఇప్పటి వరకు 42 మంది కోలుకుని డిచ్చార్జ్ అయ్యార‌ని, 15 మంది మ‌ర‌ణించార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం 546 మందికి ఆస్ప‌త్రుల్లో చికిత్స అందిస్తున్న‌ట్ల‌ను చెప్పింది. ఏపీలో అత్య‌ధికంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 129 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గుంటూరు జిల్లాలో 126, కృష్ణా జిల్లాలో 70, నెల్లూరులో 67 మంది క‌ర‌నా బారిన‌ప‌డ్డారు.

సీఎం జ‌గ‌న్ ఇంటి స‌మీపంలో మ‌హిళ మృతి

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇంటి స‌మీపంలో ఓ మ‌హిళ క‌రోనాతో మ‌ర‌ణించింది. గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని సీఎం అధికార నివాసానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న పాత టోల్ గేట్ వద్ద మారుతి అపార్ట్మెంట్ లో నివాసం ఉండే 62 ఏళ్ల మ‌హిళ అనారోగ్యంతో విజ‌య‌వాడ‌లోని ఓ ఆస్ప‌త్రిలో చేరింది. అక్క‌డ చికిత్స పొందుతూ ఆరోగ్యం విష‌మించి మ‌ర‌ణించింది. ఆ త‌ర్వాత అనుమానం వ‌చ్చి టెస్టుల చేయ‌గా.. ఆమె క‌రోనాతోనే మ‌ర‌ణించిన‌ట్లు నిర్ధార‌ణ అయింది.