
రాజన్నసిరిసిల్ల, వెలుగు : తన ఫోర్జరీ సంతకంతో రూ.26లక్షలు డ్రా చేసుకుని మోసం చేశాడని వికాస్ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్తో సహా నలుగురం కలిసి డిగ్రీ కాలేజీ నిర్వహిస్తున్నామన్నారు. శ్రీనివాస్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.26లక్షలు డ్రా చేసుకొని వాడుకున్నాడని జగన్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.