
కొమరం భీం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కౌటాల మండలం ముత్యంపేట సమీపంలో పత్తిలోడుతో బోలేరా వాహనం వెళుతుంది. ఈ సమయంలో ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తి.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో 40 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. బెజ్జూరు మండలం నుంచి మహారాష్ట్ర రాజు జిన్నింగ్ మిల్ కు వెళుతుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ..