పాలకంపెనీ కంట్రీ డిలైట్ నుంచి తేనె

పాలకంపెనీ కంట్రీ డిలైట్ నుంచి తేనె

హైదరాబాద్, వెలుగు: డెయిరీ ప్రొడక్టులు అమ్మే కంట్రీ డిలైట్  తేనెను కూడా మార్కెట్లో విడుదల చేసింది.  దీనిని   న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్​ఎంఆర్) ద్వారా పరీక్షించారు. 

ఇందులో చక్కెరను చేర్చలేదు. ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ  ప్రమాణాల ప్రకారం 36 నాణ్యతా పరీక్షలను సైతం ఎదుర్కొందని కంట్రీ డిలైట్ సీఈఓ, కో–ఫౌండర్​ చక్రధర్ గడే చెప్పారు.  ప్రతి బ్యాచ్​కు ఎన్​ఎంఆర్​ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.  

కంట్రీ డిలైట్ ఫార్మ్ హనీ ధరలు రూ.196–రూ.233 మధ్య ఉంటాయి. దీనిని 17 ప్రధాన భారతీయ నగరాల్లో కంట్రీ డిలైట్ యాప్‌‌ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.