దేశం పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క

దేశం పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఢిల్లీలో వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుదిశ్వాస విడువగా శుక్రవారం ములుగులో ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసుకున్న ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని, ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకారం అన్నారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలన్న మంత్రి సీతక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.