హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి  దంపతుల ఆత్మహత్య
  • ఇద్దరు పిల్లలకు ఉరి వేసి..  దంపతుల ఆత్మహత్య
  • వేర్వేరు రూమ్స్‌‌లో ఉరేసుకొనిభార్యాభర్తల బలవన్మరణం 
  • ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ 

ఓయూ, వెలుగు: హైదరాబాద్‌‌లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తల్లిదండ్రులు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌‌కు చెందిన చంద్రశేఖర్​రెడ్డి(44), కవిత(35) దంపతులు. వీళ్లకు కూతురు శ్రీతారెడ్డి(13), కొడుకు విశ్వంత్ రెడ్డి(10) ఉన్నారు. 8 నెలల కింద ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌‌కు వచ్చిన చంద్రశేఖర్​రెడ్డి.. హబ్సిగూడ పరిధిలోని రవీంద్రనగర్‌‌‌‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆయన బిడ్డ శ్రీతారెడ్డి 9వ తరగతి, కొడుకు విశ్వంత్ రెడ్డి 5వ తరగతి చదువుతున్నారు. 

ఓ ప్రైవేట్​కాలేజీలో జూనియర్​లెక్చరర్‌‌‌‌గా పనిచేసిన చంద్రశేఖర్​రెడ్డి.. ఆరు నెలల కింద జాబ్​మానేశాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి పిల్లలకు ఉరి వేసి చంపేశారు. ఆ తర్వాత వేర్వేరు రూమ్స్‌‌లో చంద్రశేఖర్, కవిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రెండు సూసైడ్​నోట్లు లభ్యమైనట్టు సీఐ రాజేంద్రనాయక్​తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య​చేసుకుంటున్నట్టు వాటిల్లో రాసి ఉందని ఆయన తెలిపారు.