
చేవెళ్ల మండలం దేవరంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తమ 3 నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అశోక్, అంకిత, చిన్నారిగా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్య కు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.