కానిస్టేబుల్స్​పై దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

కానిస్టేబుల్స్​పై దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

గచ్చిబౌలి, వెలుగు :  మర్డర్​ కేసులో తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుళ్లపై దాడి చేసిన కేసులో నిందితునికి జీవిత కాల శిక్ష పడింది.   సైబరాబాద్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నార్సింగి పోలీస్​ స్టేషన్​ పరిధిలో 2023 జనవరి లో   జరిగిన ఓ మర్డర్​ కేసులో నిందితుడుగా ఉన్న కరణ్​సింగ్ ఎల్లమ్మబండలోని సిక్కు బస్తీలో ఉన్నాడని సమాచారం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు కానిస్టేబుల్స్​ రాజునాయక్​, విజయ్​ వెళ్లారు.

 దీంతో కరణ్​సింగ్​ ఈ ఇద్దరిపై  కత్తితో దాడి చేశాడు.   కానిస్టేబుల్స్​ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి11.45 గంటలకు జగద్గిరిగుట్ట పోలీసులు కరణ్​సింగ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కేసులో పోలీసులు చార్జ్​షీట్ ఫైల్​ చేయగా,  మంగళవారం  నిందితునికి  జీవిత కాలం జైలు శిక్ష, రూ.15వేల ఫైన్​ విధిస్తూ తీర్పు వెల్లడించారు. ​