హనుమాన్​ ర్యాలీ రోజు.. నిజామాబాద్ లో ట్రాఫిక్​ డైవర్షన్

హనుమాన్​ ర్యాలీ రోజు.. నిజామాబాద్ లో ట్రాఫిక్​ డైవర్షన్

నిజామాబాద్, వెలుగు : ఈ నెల 12 నగరంలో నిర్వహించే హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ మళ్లించనున్నట్లు  సీపీ సాయి చైతన్య తెలిపారు. గురువారం హనుమాన్​ ర్యాలీ ఆర్గనైజర్లతో  మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు.  కంఠేశ్వర్​ ఆలయం నుంచి షురువయ్యే ర్యాలీ జడ్పీ చౌరస్తా, హమాల్​వాడీ, ప్రభాత్​ టాకీస్​, రైల్వే ఓవర్​ బ్రిడ్జి, గోదామ్​ రోడ్డు, దేవీ రోడ్డు, మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆజంరోడ్, పెద్ద బజార్ మీదుగా ఆర్ఆర్​ చౌరస్తాకు చేరుకుంటుందన్నారు. 

ర్యాలీ కొనసాగే రోడ్ల పక్కన షాప్​లు, ఇండ్లు ఉన్న వ్యక్తులు శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు వాహనాలు పార్కింగ్​ చేయొద్దన్నారు.  సిటీలోకి వెహికల్స్​ ఎంటర్​ కాకుండా మూడు మార్గాల్లో ట్రాఫిక్​ డైవర్ట్​ చేయనున్నామని పేర్కొన్నారు.