
కూసుమంచి,వెలుగు : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు గైగోళ్లపల్లి మాజీ సర్పంచ్, సీపీఐ సీనియర్ నేత సంగబత్తుల వెంకటరెడ్డి (98)ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం అంతియాత్ర ముగిసింది. వెంకటరెడ్డికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించారు. ఆయనతో పాటు సీపీఐ నాయకులు భాగం హేమంత్రావు,జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్,మహ్మమద్ మౌలానా,దండి సురేశ్ కర్ణ కుమార్, వెంకటేశ్వరరావు, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.