హైడ్రా హైడ్రోజన్ బాంబు లాంటిది..పేదోడి జోలికొస్తే ఊరుకోం: ఎమ్మెల్యే కూనంనేని

హైడ్రా హైడ్రోజన్ బాంబు లాంటిది..పేదోడి జోలికొస్తే ఊరుకోం: ఎమ్మెల్యే కూనంనేని

 కాంగ్రెస్ మిత్రపక్షమేనన్నారు  సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.  కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఏడాది పాటు పరిశీలిస్తాం.. తప్పులు చేస్తే ప్రశ్నిస్తామన్నారు. హైడ్రా హైడ్రోజన్ బాంబు లాంటిదన్నారు. విధ్వంసం, వికాసానికి ఉపయోగించవచ్చన్నారు. పేదల జోలికి వస్తే ఊరుకోబోమని చెప్పారు..

Also Read :- ప్రజాభద్రతే ముఖ్యం..మతపరమైన నిర్మాణాలు తొలగించాల్సిందే

 కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై  గందరగోళం చేసుకున్నారని అన్నారు కూనంనేని. తులం బంగారం హామీ, మహిళలకు రెండున్నరవేల స్కీముపై క్లారిటీ ఇవ్వాలన్నారు.  కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిందేనని చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసిందన్నారు.  బీజేపీ నేతలపై ఈడీ దాడులు ఉండబోవన్నారు కూనంనేని