రేవంత్​ ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నరు : కూనంనేని

రేవంత్​ ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నరు : కూనంనేని
  • సమన్వయంలో  కొంత లోపం ఉన్నది: కూనంనేని
  • కొత్తగూడెం, రామగుండం ఎయిర్​పోర్టుల 
  •  కోసం కృషిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే, సమన్వయంలో మాత్రం కొంత లోపం కనిపిస్తున్నదని, దానిని సరిదిద్దుకోవాలని సూచించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.

కొత్తగూడెం, రామగుండం ఎయిర్​పోర్టులు రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కుమారుడు, ఎంపీ వంశీ తనకు చెప్పారని, ఆ కుట్రలను తిప్పికొట్టి ఎయిర్​పోర్టులను తీసుకొచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.   రైతులను ఆదుకున్నట్టే 2 కోట్ల మందికిపైగా ఉన్న అసంఘటిత కార్మికుల సంక్షేమానికీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. కాగా, సీఎంను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య  వచ్చినా.. ఆయనకు అపాయింట్​మెంట్​ ఇవ్వకపోవడం ఆవేదనకు గురిచేసిందని తెలిపారు.