కామారెడ్డిటౌన్, వెలుగు: కేంద్ర బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు తగిన ప్రయారిటీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 11 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కామారెడ్డి జిల్లాకు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. అయినప్పటికీ ఇక్కడి ప్రజలు కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ క్యాండిడేట్ను గెలిపించారన్నారు.
సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా మన్మాడ్ వైపు వెళ్లే రైల్వే లైన్ను డబుల్ లైన్గా మార్చాలని, కామారెడ్డి పట్టణంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. జిల్లాలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు మంజూరు చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకటిగౌడ్, లీడర్లు మోతీరాం, నర్సింహులు, అరుణ్కుమార్, సురేశ్ పాల్గొన్నారు.