ముషీరాబాద్, వెలుగు: ప్రొఫెసర్సాయిబాబా జీవితం ఓ పోరాటమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జీవితమే సందేశం అనే మాటకు ఆయన నిలవెత్తు నిదర్శనమన్నారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ప్రజా సంఘాలు, సాయిబాబా బంధుమిత్రుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్సాయిబాబా సంస్కరణ సభ జరిగింది.
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సాయిబాబా విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన పోరాటాలను దేశంలోని పీడిత ప్రజలు స్మరించుకుంటున్నారని చెప్పారు. ప్రజా ఉద్యమాలను, ప్రత్యేకంగా ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయడానికి దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.