రేషన్ బియ్యం దందాకు చెక్

రేషన్ బియ్యం దందాకు చెక్
  • కూపీ లాగుతున్న సివిల్ సప్లయ్​ టాస్క్ ఫోర్స్ 

కాగజ్ నగర్, వెలుగు: రేషన్ బియ్యం అక్రమ దందాను అడ్డుకునేందుకు సివిల్​ సప్లయ్​ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ఓ ఎస్ డీ శ్రీధర్ రెడ్డి టీమ్ సిర్పూర్ టీ, కాగ జ్ నగర్, దహెగాం మండలాల్లో రేషన్ షాపులు, బియ్యం అక్రమ రవాణా చేసే వ్యక్తుల ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు.

 ఇటీవల మహారాష్ట్ర కు రేషన్​ బియ్యాన్ని తరలిస్తుండగా సిర్పూర్ టీ పోలీసులు పట్టుకున్నారు. వ్యాపారులకు సహకరిస్తున్న  కాగ జ్ నగర్ లోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ తనిఖీలో సివిల్ సప్లయ్​ డీఎస్పీ శేఖర్ రెడ్డి, సిర్పూర్ టీ ఎస్ఐ కమలాకర్, జిల్లా సివిల్ సప్లయ్​ డిప్యూటీ తహసీల్దార్ లు రాజ్ కుమార్, శ్రీనివాస్, అంజయ్య, శ్రీలత  పాల్గొన్నారు.