
- నెల రోజులకే సీసీ రోడ్లకు పగుళ్లు
తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండల కేంద్రంలో సీసీ రోడ్డు వేసిన నెల రోజులు గడవక ముందే పగుళ్లు వచ్చి, పెచ్చులు లేచిపోతున్నాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం మెటీరియల్ వాడకం, సరైన వాటర్ క్యూరింగ్ చేయకపోవడం వల్లనే రోడ్లు దెబ్బతింటున్నాయి.
సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతా శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.