బోర్‌‌‌‌వెల్‌‌ రిపేర్ ​చేస్తుండగా ప్రమాదం.. చనిపోయిన క్రేన్ ఆపరేటర్  

బోర్‌‌‌‌వెల్‌‌ రిపేర్ ​చేస్తుండగా ప్రమాదం.. చనిపోయిన క్రేన్ ఆపరేటర్  
  • పెద్దపల్లి జిల్లా గోలివాడ 
  • పంప్​హౌస్ క్యాంప్ వద్ద ఘటన

గోదావరిఖని, వెలుగు : బోర్​ వెల్​ రిపేర్​చేస్తుండగా ఒకరు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ పంప్​హౌస్​వద్ద జరిగింది. ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన గుండబోయిన సంపత్​(40) మెఘా కంపెనీలో క్రేన్​ ఆపరేటర్. కుటుంబంతో క్యాంప్​లో ఉంటుండగా.. బోర్ ​వెల్​లో పడిపోయిన మోటర్​ను పైకి తెచ్చేందుకు బుధవారం ఇనుప రాడ్ ​సాయంతో సంపత్​ తీస్తున్నాడు.

బోర్​పైప్ లోకి తొంగిచూడగా..  అదే సమయంలో మోటర్​ కిందకు వెళ్లడంతో ఇనుప రాడ్ ​వేగంగా పైకి వచ్చి అతని ​కంటిలోంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడగా గోదావరిఖని ఏరియా హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదుతో అంతర్గాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.