ఇన్​స్టా అడ్డాగా క్రికెట్ బెట్టింగ్.. SR నగర్‎లో ముగ్గురు అరెస్ట్

ఇన్​స్టా అడ్డాగా క్రికెట్ బెట్టింగ్.. SR నగర్‎లో ముగ్గురు అరెస్ట్

పంజాగుట్ట, వెలుగు: ఇన్ స్టాగ్రామ్​అడ్డాగా ఆన్​లైన్​క్రికెట్​బెట్టింగ్​నిర్వహిస్తున్న ముఠాను ఎస్సార్​నగర్​పోలీసులు అరెస్ట్ చేశారు. 7 ల్యాప్​టాప్‎లు, 15 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.4.73లక్షలు ఉన్న 10 బ్యాంక్​అకౌంట్లను సీజ్​చేశారు. కరీంనగర్‎కు చెందిన లింగాల అరుణ్​రాజ్(24) మాదాపూర్‎లో ఉంటున్నాడు. ఎస్సార్​నగర్​పరిధిలోని జయప్రకాశ్​నగర్‎లో ఉండే లింగాల సాకేత్(23), మేకల సంజయ్(22) అనే మరో ఇద్దరు బుకీలతో కలిసి క్రికెట్​బెట్టింగ్స్​నిర్వహిస్తున్నాడు. ఇన్​స్టాగ్రామ్‎లో క్రికెట్ 360 మీడియా అనే పేజీని స్టార్ట్​చేసి, దాని ద్వారా బెట్టింగ్స్​కొనసాగిస్తున్నాడు. 

ఈ క్రమంలో అరుణ్​రాజ్‎కు గుగో బెట్​ఇండియా అనే ప్రమోషన్​మీడియా వెబ్​సైట్​ద్వారా తైవాన్‎లో ఉండే ప్రధాన బుకీ గ్రెగోరి పరిచయమయ్యాడు. అతనితో కలిసి పని చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు. హైపర్ టూల్స్​అనే ప్రైవేట్​అప్లికేషన్​ ద్వారా క్రికెట్​బెట్టింగ్​నిర్వస్తూ.. ఇన్​స్టాలో యువతను ఆకర్షిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సార్​నగర్​పోలీసులు సోమవారం సాయంత్రం జయప్రకాశ్​నగర్‎లో బెట్టింగ్​నిర్వహిస్తున్న ఇంటిపై  రైడ్​చేశారు. అరుణ్​రాజ్, సాకేత్, సంజయ్‎ను అరెస్ట్​ చేశారు. తైనాన్‏కు చెందిన ప్రధాన బుకీ గ్రెగోరితోపాటు మరో 10 మంది పరారీలో ఉన్నారని ఇన్​స్పెక్టర్​శ్రీనాథ్​రెడ్డి తెలిపారు. డీసీపీ విజయ్​కుమార్, ఏసీపీ వెంటకరమణ  పర్యవేక్షణలో డీఐ గోపాల్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.