
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య దైవసందేశాన్ని అందించారు. అనంతరం చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. చర్చి బాధ్యులు సాంసన్ సందీప్, సంపత్, సువన్ డగ్లస్, కమిటీ మెంబర్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులు చర్చి పరిసర ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకొని ఆనందంగా గడిపారు.