
బర్డ్ ఫ్లూ ప్రచారం జరుగుతుండడంతో చికెన్, కోడిగుడ్డు అమ్మకాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో మెదక్ పట్టణం ఆటోనగర్లోని ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు శుక్రవారం చికెన్, ఎగ్ మేళా నిర్వహించాడు. ఇందులో భాగంగా చికెన్, కోడిగుడ్డుతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేశాడు.
విషయం తెలుసుకున్న ప్రజలు వాటిని తినేందుకు ఎగబడ్డారు. చికెన్, గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయం ప్రజలకు తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చేసినట్లు చికెన్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు.
- మెదక్టౌన్, వెలుగు