
హైదరాబాద్, వెలుగు: ఇండియా క్రిప్టో మార్కెట్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని, గత జనవరి నుంచి ఈ జనవరి వరకు మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 20 శాతం పెరిగిందని క్రిప్టో ఎక్స్చేంజ్జియోటస్ తెలిపింది. మొత్తం ట్రేడింగ్ వాల్యూమ్లో వీరి వాటా 15 శాతం ఉంది. మహిళా ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బిట్కాయిన్, ఎథేరియమ్ వంటి క్రిప్టోలను ఎక్కువగా కొంటున్నారు.
ఫైనాన్స్ ప్రొడక్టులపై, క్రిప్టోలపై అవగాహన పెరగడమే ఇందుకు కారణం. క్రిప్టోల్లో ఎక్కువగా యువతే పెట్టుబడులు పెడతారనేది అపోహ అని, 36–50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలూ ఇన్వెస్ట్ చేస్తున్నారని జియోటస్ తెలిపింది. మొత్తం ట్రేడర్లలో వీరి సంఖ్య 32 శాతం వరకు ఉంటుంది. చిన్న నగరాల మహిళలూ క్రిప్టోలపై ఆసక్తి చూపుతున్నారని జియోటస్ వెల్లడించింది.