స్కూళ్ల​ నిర్మాణ పనులు చేపట్టండి : అధికారులకు సీఎస్ ​ఆదేశం

స్కూళ్ల​ నిర్మాణ పనులు చేపట్టండి : అధికారులకు సీఎస్ ​ఆదేశం

 హైదరాబాద్, వెలుగు: కొడంగల్​తోపాటు మధిర నియోజకవర్గం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్‌‌ రెసిడెన్షి యల్‌‌ పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోగా ప్రారంభించాలని అధికారులను సీఎస్​శాంతికుమారి ఆదేశించారు. సెక్రటేరియెలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌‌మెంట్ కమిటీ మొదటి సమా వేశం గురువారం సీఎస్​అధ్యక్షతన జరిగింది. 

పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించేందుకు అనుసరించాల్సిన విధానాలు, ప్రతిపాదనల ప్రక్రియకు నోడల్ విభాగం ఖరారుపై చర్చించారు. సమీకృత రెసిడెన్షియల్‌‌ పాఠశాలల నిర్వహణ, రెసిడెన్షియల్‌‌ పాఠశాలలకు భూములు కేటాయించడంపై చర్చించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతివారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణ యించారు. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌‌రాజు, ముఖ్య కార్యదర్శులు నవీన్‌‌ మిట్టల్‌‌, వెంకటేశం, సందీప్‌‌ కుమార్‌‌ సుల్తానియా, శ్రీధర్‌‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్‌‌  పాల్గొన్నారు.