పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాల్పురం శివారు డబుల్బెడ్రూం ఇండ్ల వద్ద బొందివాగుపై నిర్మిస్తున్న కల్వర్లు పనుల్లో నాణ్యత కరువైంది. కల్వర్టు, రెండువైపులా 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరవగా, కాంట్రాక్టర్ పైపుల కింద బేస్కు క్యూరింగ్ చేయకుండానే పనులు కానిచ్చేస్తున్నారని, నాణ్యత లేకుండా చేసే పనులతో కల్వర్టు కొద్దిరోజులకే కూలిపోయే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు డైవర్షన్ రోడ్డు కూడా సరిగా రోలింగ్ చేయకపోవడంతో భారీ వాహనాలు రోడ్డుపై దిగబడిపోయి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమైన ఆర్అండ్బీ ఏఈ రత్నశేఖర్ను వివరణ కోరగా ప్రస్తుతం చేసిన పనులకు ఇంకా బిల్లు చేయలేదని, పనులకుటాక్స్పర్మిట్సీజన్ఆప్రూవల్ రాలేదని కాంట్రాక్టర్ను పనులు చేయవద్దని చెప్పామన్నారు.