
జనాల్లో విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అందినకాడికి దోచుకొనేందుకు సైబర్ ఛీటర్స్ కొత్త తరహా దందా మొదలు పెట్టారు. కరీంనగర్ లో సైబర్ క్రిమినల్స్ ఓ యువకుడిని బెదిరించారు. సీబీఐ.. ఈడీ.. సుప్రీంకోర్టు పేరును ఉపయోగించి కుట్రకు ప్లాన్ చేశారు. అంతేకాదు.. ఏకంగా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరును కూడా వాడారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
కరీంనగర్ కు చెందిన చిలువేరు శ్రీకాంత్ అనే వ్యక్తికి ఈ రోజు ( ఏప్రిల్ 20) మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులనుంచి వీడియో కాల్ వచ్చింది. నీవు మనీలాండరింగ్కు పాల్పడ్డావని .. మేము చెప్పినట్లు వినకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని శ్రీకాంత్ కు తెలిపారు. శ్రీకాంత్ కరీంనగర్లో సింగర్ గా... ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్ గా కొనసాగుతున్నాడు.
సైబర్ ఛీటర్స్ శ్రీకాంత్ ఆధార్ కార్డు నెంబర్ తో సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ లేఖలు పంపించారు. దీనితో పాటు మహారాష్ట్ర పోలీస్ అధికారి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరుతో ఓ లెటర్ కు కూడా పంపారు. తరువాత రెండు గంటలపాటు తరచూ వీడియో కాల్స్ చేస్తూ... చివరకు డబ్బులు ఇస్తే వదిలేస్తామని ఛీటర్స్ అన్నారని తెలిపాడు. తన వివరాలు మిస్ యూజ్ అయ్యాయనుకున్న సైబర్ ఛీటర్స్ బాధితుడు శ్రీకాంత్... సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. సైబర్ అరెస్టు పేరుతో బెదిరించి లక్షలు కాజేయాలని ప్లాన్ వేసిన సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు శ్రీకాంత్.