
- రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని చీట్చేసిన సైబర్ నేరగాళ్లు
బషీర్బాగ్, వెలుగు: కరెంట్ బిల్లు పేమెంట్ కోసం గూగుల్లో సర్చ్చేసిన రిటైర్డ్ప్రభుత్వ ఉద్యోగిని టార్గెట్చేసి సైబర్నేరగాళ్లు రూ.2.50 లక్షలు కొట్టేశారు. బాధితుడి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేశారు. సిటీకి చెందిన రిటైర్డ్ప్రభుత్వ ఉద్యోగి(77) మార్చి నెలకు సంబంధించిన కరెంట్బిల్లును ఇటీవల ఆన్లైన్ద్వారా పే చేశాడు.
బ్యాంక్అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినప్పటికీ పేమెంట్ సక్సెస్అయినట్లు చూపించలేదు. బిల్లు పెండింగ్ ఉన్నట్లు చూపడంతో, ఎక్కడ కరెంట్ సప్లయ్కట్చేస్తారోననే భయంతో మరోసారి పేమెంట్ చేశాడు. తర్వాత గూగుల్ లో బిల్ డెస్క్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం సర్చ్చేశాడు. అందులోని నంబర్కు కాల్చేసి పేమెంట్సమస్యను వివరించాడు. తర్వాత వృద్ధుడికి వాట్సాప్కాల్వచ్చింది. సమస్యను పరిష్కరించేందుకు బ్యాంక్అకౌంట్నంబర్, ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని కోరగా వృద్ధుడు అన్నీ చెప్పాడు.
తర్వాత మొబైల్ స్క్రీన్ షేర్ చేయమని కోరగా వృద్ధుడు షేర్చేశాడు. తర్వాత వరుసగా ఓటీపీలు వచ్చాయి. క్షణాల్లో వృద్ధుడి మూడు బ్యాంక్అకౌంట్లలోని రూ.2,49,896 కట్ అయ్యాయి. కొద్దిసేపటికి తేరుకున్న వృద్ధుడు తాను సైబర్నేరగాళ్ల వలలో పడ్డానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.