
హైదరాబాద్, వెలుగు: స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్పేరుతో సైబర్ సైబర్ నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ ని చీట్ చేసి, రూ.4.31కోట్లు కొల్లగొట్టారు. నెల రోజుల వ్యవధిలో ఇంత మొత్తాన్ని కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 11 మందిపై కేసు నమోదు చేశారు. సిటీలోని యాప్రాల్ప్రాంతానికి చెందిన రాజేశ్వరరావుకు గత నెలలో ఇన్స్టాగ్రామ్లో ఓ లింక్ వచ్చింది. దాన్ని క్లిక్చేయడంతో అతని ఫోన్ నంబర్ ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయింది. అందులోని దివ్యాంశి అగర్వాల్ అనే మెంబర్ ఫిన్వసియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని రాజేశ్వరరావును రిక్వెస్ట్చేసింది.
‘శూన్య’ అనే యాప్లింక్సెండ్చేసింది. నిజమేనని నమ్మిన రాజేశ్వరరావు శూన్యా యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టడం స్టార్ట్చేశాడు. తర్వాత దివ్యాంశి అగర్వాల్అశోక్రెడ్డి అనే మరో వ్యక్తిని వాట్సప్ ద్వారా పరిచయం చేసింది. అశోక్సూచనతో రాజేశ్వరరావు ‘ట్రశూన్యన్’ అనే మరో యాప్లో ఇన్వెస్ట్చేయడం స్టార్ట్చేశాడు. తర్వాత ఇన్వెస్ట్మెంట్లో భాగంగా అతని నుంచి విడతల వారీగా పలు కంపెనీల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి రూ.4.31 కోట్లు ట్రాన్స్ఫర్చేయించారు.
ఎలాంటి లాభాలు రాకపోగా, మరికొంత డిపాజిట్చేయాలని దివ్యాంశి అగర్వాల్, అశోక్రెడ్డి ఒత్తిడి చేయడంతో రాజేశ్వరరావు మోసపోయానని గుర్తించాడు.సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశాడు.