
మిడ్జిల్: వెలుగు : హర్ష సాయి టీం పేరుతో.. సహాయం చేస్తామని నమ్మించి రూ. 17వేలు కాజేసిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన బరిగెల ఆంజనేయులు తండ్రి జంగయ్య గత సంవత్సరం జరిగిన ఓ యాక్సిడెంటులో తీవ్రంగా గాయపడ్డాడు. వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుతున్నాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంజనేయులు.. హర్ష సాయి ఇన్స్టా గ్రామ్ ఐడీ లో సాయం కావాలని కామెంట్ చేశాడు. .
ఇది గమనించిన దుండగులు హర్ష సాయి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని రూ. 4లక్షల సాయం చేస్తామని సంప్రదించారు. డాక్యుమెంట్ చార్జెస్, ఆఫీస్ బ్యాక్ ఎండ్ చార్జెస్ ఉంటాయని , అవి ఫోన్ పే చేస్తే.. ఆ మరుక్షణమే హర్ష సాయి టీం నుంచి సాయం అందుతుందని చెప్పారు. నమ్మిన ఆంజనేయులు మంగళవారం సాయంత్రం వారిచ్చిన ఫోన్ నెంబర్కు 22 వేలు ఫోన్ పే ద్వారా పంపారు. సహాయం కోసం ఆంజనేయులు మళ్ళీ ఫోన్ చేస్తే కేవలం 5500 ఫోన్ పే చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. చివరికి మోసపోయానని గ్రహించిన ఆంజనేయులు పోలీసులను సంప్రదించాడు.