
- చాలా వరకు అక్రమ నిర్మాణాల్లోనే కొనసాగుతున్నయ్
- పోలీసులు, హైడ్రా అధికారుల పరిశీలనలో వెల్లడి
- సైబరాబాద్ సీపీ ఆఫీసులో హాస్టల్ మేనేజ్మెంట్లతో సమన్వయ సమావేశం
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ పరిధిలోని 75 శాతం హాస్టళ్లలో ఫైర్సేఫ్టీ లేదని సైబరాబాద్సీపీ అవినాష్మహంతి తెలిపారు. చాలావరకు అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్నట్లు గుర్తించామన్నారు. సైబరాబాద్ సీపీ ఆఫీసులో బుధవారం మాదాపూర్, బాలానగర్జోన్ల పరిధిలోని హాస్టళ్ల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీపీ అవినాష్ మహంతి, జాయింట్సీపీ గజారావు భూపాల్పాల్గొని మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, ఫైర్సేఫ్టీపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో మొత్తం 4 వేల హాస్టళ్లు ఉన్నాయని, ప్రతిఒక్కరూ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, భద్రతపై తగిచ చర్యలు తీసుకోవాలని సూచించారు.
హాస్టళ్లలో ఉండే వారి వివరాలను రికార్డుల్లో పొందుపరచాలని తెలిపారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జాయింట్సీపీ గజారావు భూపాల్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో పార్కింగ్సదుపాయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ నంబర్లను డిస్ప్లే చేయాలన్నారు. హైడ్రా అదనపు డైరెక్టర్(ఫైర్) మాట్లాడుతూ.. హాస్టళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా ఫైర్ఎన్ఓసీ తీసుకోవాలన్నారు. 75 శాతం హాస్టళ్లలో ఫైర్సేఫ్టీ లేదని చెప్పారు. డీసీపీలు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు, హైడ్రా అధికారులు, హాస్టల్ ప్రతినిధులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.