
కూకట్పల్లి, వెలుగు: నేరాల నియంత్రణ, కేసు విచారణల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీసీ కెమెరాలను సైబరాబాద్పోలీసులు తమ పెట్రోలింగ్ వెహికల్స్కు బిగించుకోవాలని చూస్తున్నారు. కమిషనర్ అవినాష్ మహంతి బాలానగర్ పీఎస్ పరిధిలోని పెట్రోలింగ్ వెహికల్స్కు ప్రయోగాత్మకంగా ఫిట్ చేయించి పరిశీలించారు.
ఏసీపీ హనుమంతరావు వాహనాలను ప్రారంభించారు. పెట్రోలింగ్టైంలో రికార్డ్అయ్యే వీడియో ఫుటేజీలను కమిషనరేట్నుంచి పర్యవేక్షిస్తారని తెలిపారు.