
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ డ్రైవ్డ్రైవ్లో 218 మంది పట్టుబడ్డారు. అత్యధికంగా శంషాబాద్పీఎస్లో 22 కేసులు నమోదు కాగా, బాలానగర్, అల్వాల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి. మియాపూర్ పీఎస్పరిధిలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
పట్టుబడిన వాహనాల్లో 176 టూ-వీలర్లు, 19 త్రీ వీలర్లు, 23 ఫోర్-వీలర్లు ఉన్నాయి. ఈ డ్రైవ్లో పట్టుబడిన వారిలో మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. 218 మందిలో 31-నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వారు 96 మంది ఉండగా, 21-– -30 ఏండ్ల మధ్య ఉన్న వారు 76 మంది ఉన్నారు. 18–20 ఏండ్ల మధ్య ఉన్నవారు నలుగురు దొరికారు.