
- యాదాద్రి పోలీసులకు బాధితుడి కంప్లయింట్
యాదాద్రి, వెలుగు : సైబర్నేరగాళ్లు నమ్మించి వ్యక్తి వద్ద రూ. లక్షల్లో కొట్టేసిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డికి చెందిన గోసాల శ్యామలరావు ఏడాదిన్నర కింద ఉపాధి కోసం యాదాద్రి జిల్లా రాయగిరికి వచ్చి ఉంటూ ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా చేస్తున్నాడు. ఈనెల15న పార్ట్టైమ్జాబ్కోసం గూగుల్లో సెర్చ్చేసి లింక్ఓపెన్చేశాడు.
అనంతరం అతడి ఫోన్నంబర్ కు 9336889968 నుంచి వీడియో లింక్వచ్చింది. దాన్ని చూసి లైక్కొట్టి ఎక్కువ మందికి షేర్చేస్తే.. ఇంట్లో నుంచే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని సైబర్ నేరగాళ్లు నమ్మించి టాస్క్లు ఇచ్చారు. వాటిని చేస్తుండగా YLL668.COM వెబ్సైట్లో డిపాజిట్ చేసిన అమౌంట్కు 30 శాతం ప్రాఫిట్ ఇస్తామని సైబర్నేరగాళ్లు మెసేజ్పెట్టారు.
దీంతో శ్యామలరావు ముందుగా రూ. వెయ్యి ఫోన్పే చేయగా రూ. 1,300 రిటన్ఇచ్చారు. అనంతరం రూ. 2 వేలు పెట్టగా.. రూ. 2600 వచ్చాయి. దీంతో నమ్మిన శ్యామలరావు ఈనెల17,18 తేదీల్లో పలుమార్లు రూ.1.72 లక్షలు ఫోన్పే ద్వారా చెల్లించాడు. డబ్బును తీసుకొని సైబర్నేరగాళ్లు రిటన్చేయలేదు. దీంతో మోసపోయానని తెలుసుకుని బాధితుడు భువనగిరి రూరల్పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.