హైదరాబాద్‌‌‌‌లో డైఫుకు కో. ప్లాంట్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌లో డైఫుకు కో. ప్లాంట్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జపనీస్‌‌‌‌ కంపెనీ   డైఫుకు కో. లిమిటెడ్  సబ్సిడరీ  డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్  ఇండియా ప్రైవేట్  లిమిటెడ్  హైదరాబాద్‌‌‌‌లో  తమ కొత్త ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించింది. దీని కోసం రూ. 227  కోట్లు ఇన్వెస్ట్  చేసింది.  

ఈ సందర్భంగా  కంపెనీ  సీఈఓ శ్రీ హిరోషి గెషిరో మాట్లాడుతూ..“మా స్ట్రాటజిక్ మార్కెట్లలో ఇండియా ఒకటి. ఇండియా  లాజిస్టిక్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లలో  ఆటోమేషన్, ఇన్నోవేషన్లను పెంచడానికి ఈ ప్లాంట్ సాయపడుతుంది” అని అన్నారు.    ఇండో-–జపనీస్ ద్వైపాక్షిక సంబంధాన్ని ఈ ప్రాజెక్ట్ మరింత బలపరుస్తుందని చెప్పారు. ఈ ప్లాంట్‌‌‌‌తో  ఇంజనీరింగ్, ఆటోమేషన్, ప్రొడక్షన్‌‌‌‌ డివిజన్లలో  100 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.