ప్రస్తుతం జనాలు చాలామంది మూడు పదుల వయస్సు వచ్చిందంటే రోజూ షుగర్ గోళీలు మింగాల్సిందే.. ఏ రోజైనా టాబ్లెట్ వేసుకోలేదా రక్తంలో గ్లోకోజ్ లెవల్స్హెచ్చు .. తగ్గులు రావడం.. ఆరోగ్యంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలామంది షుగర్ కంట్రోల్ కాక వారు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కాని కిచెన్ లో ఉండే ఉల్లిపాయతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
ప్రజెంట్ జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. మందులు వాడుతున్నా సరైన డైట్ పాటించకపోవడంతో షుగర్ లెవెల్స్ పెరిగి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అలాకాకుడదంటే మందులతో పాటు కొన్ని ఆహారనియమాలు పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు.
Also Read :- భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత.. విశిష్టత ఇదే..
మన ఇంట్లో ఉండే చిన్నపాటి చిట్కాతో చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగంటే.. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయల్ని తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకేసారి యాభై గ్రాములు తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొంచెం తినవచ్చు. షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. దానికి బదులుగా యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. అందుకే క్రమం తప్పకుండా ఏడు రోజులు పాటు ఈ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బాగా ఎక్కువగా ఉన్న షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.
–వెలుగు, లైఫ్–