సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలి

సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలి

చెన్నూర్, వెలుగు: చెన్నూర్ మండలం సోమన్ పల్లిలో తాము 20 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వాలని సోమన్ పల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు తోకల లక్ష్మణ్, లింగయ్య కోరారు. 

ఆదివారం స్థానిక ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సోమన్​పల్లిలోని 306, 1267 సర్వే నెంబర్లలో 119 ఎకరాల భూమిని సుమారు 100 కుటుంబాలు 20 ఏండ్లుగా సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్​తో పాటు మరి కొందరు ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి సాగులో ఉన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.